News March 13, 2025
ఇన్స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
Similar News
News September 13, 2025
వెంకటాపూర్: 34 అడుగులకు చేరువలో రామప్ప నీటిమట్టం

వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు నీటిమట్టం 33.6 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు చేరుతుంది. సరస్వతి నీటిమట్టం 36 అడుగులు కాగా.. 35 అడుగులకు మత్తడి పడే అవకాశం ఉంది. దీంతో రెండు పంటలకు సరిపడా నీరు అందుతుందని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 13, 2025
సంగారెడ్డి: జిల్లాకు ఆరెంజ్ అలర్ట్: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య శనివారం తెలిపారు. జిల్లాకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని చెప్పారు.
News September 13, 2025
ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్లో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్ ఎయిర్పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.