News March 13, 2025
కడపలో చదువుల తల్లి ఇక లేదు

కడపలో బుధవారం హృదయాన్ని కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. కడపకు చెందిన ఆయేషా ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో బుధవారం ఫిజిక్స్ రాస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సిబ్బంది దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆయేషా పదో తరగతిలో 592, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 425 మార్కులు సాధించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.
Similar News
News March 18, 2026
కడపలో నేడు మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కడపలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందు జరగనుంది. కాగా ముస్లిం సోదరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం గురువులు పాల్గొంటారన్నారు.
News March 18, 2026
కడప జిల్లాలో భారీగా ఆగిన నగదు చెల్లింపు

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.
News March 18, 2026
కడప: రైతులకు చెల్లించాల్సింది ఎంతో.. చెళ్లించింది కొంతే.!

కడప జిల్లాలో మార్క్ ఫెడ్ ఈ నెల 17 నాటికి 3,143 మంది రైతుల నుంచి 13,078 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేసింది. క్వింటాలు రూ.5,875ల MSPతో రూ.76.83 కోట్ల శనగలను తీసుకుంది. ఇందుకు గాను ఇప్పటి వరకు కేవలం 89 మంది రైతులకు మాత్రమే పేమెంట్ జరిగింది. 385MTలకు సంబంధించి రూ.1.67 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 3,054 మంది రైతులకు సంబంధించిన 12.693MTల శనగలకు రూ.75.16 కోట్లు చెల్లించాల్సిఉంది.


