News March 13, 2025
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 39.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా దగడలో 39.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 39.3 డిగ్రీలు, జిల్లా జక్లేరులో 39.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 14, 2025
WPL: ఫైనల్లో ముంబై

గుజరాత్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI ముందుగా బ్యాటింగ్ చేయగా మాథ్యూస్(77), స్కివర్ బ్రంట్(77) విధ్వంసంతో 213 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గిబ్సన్(34)దే అత్యధిక స్కోరు. దీంతో ముంబై ఫైనల్ చేరింది. ఈ నెల 15న ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.
News March 14, 2025
హోలీ.. రేపు ‘బ్లడ్ మూన్’

రంగుల పండుగ హోలీ వేళ రేపు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా భూమి వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి సూర్యకిరణాలు ప్రసరించి జాబిల్లి ఎర్రగా మారనుంది. దీన్నే ‘బ్లడ్ మూన్గా పిలుస్తారు. కానీ ఇది భారత్లో కనిపించదు. యూరప్ దేశాలతో పాటు సౌత్, నార్త్ అమెరికా, వెస్ట్రన్ ఆఫ్రికా దేశాల్లో బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.
News March 14, 2025
వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

√ VKB: ఇంటర్ పరీక్షలకు 257 మంది విద్యార్థుల గైర్హాజరు √ పూడూరు:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ √ తాండూరు:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముగ్గురు నూతన లెక్చరర్ల జాయినింగ్ √ VKB: సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు:అ. కలెక్టర్ √ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలో హోలీ సంబరాలు √బొంరాస్పేట: సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల నిరసన √ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: ఎస్సైలు.