News March 13, 2025

21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

image

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్‌వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్‌లో డయ్యర్‌ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.

Similar News

News March 13, 2025

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

image

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.

News March 13, 2025

స్పీకర్‌ను కించపరచలేదు.. ప్రభుత్వాన్ని నిలదీశా: జగదీశ్ రెడ్డి

image

TG: అసెంబ్లీలో తాను స్పీకర్‌ను కించపరచలేదని, ప్రభుత్వాన్ని నిలదీశానని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తనపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో కేటీఆర్, హరీశ్‌రావుతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సభలో అందరికీ సమాన హక్కులుంటాయని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్నారు. స్పష్టమైన కారణం లేకుండా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇంకా బలంగా గొంతు వినిపిస్తానని జగదీశ్ స్పష్టం చేశారు.

News March 13, 2025

బిగ్ స్కామ్: Blinkitను గుడ్డిగా నమ్మవద్దంటున్న యూజర్

image

కస్టమర్లను Blinkit మోసగిస్తోందని ఓ యూజర్ Redditలో పోస్టు పెట్టారు. తాను అరకిలో ద్రాక్షపళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370గ్రా. డెలివరీ చేసిందన్నారు. డౌటొచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే మళ్లీ ప్యాకేజ్‌తో సహా 370గ్రా. తూకమే ఉందని పేర్కొన్నారు. ఇదో పెద్ద స్కామ్ అని, ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయాలు పంపిస్తోందని ఆరోపించారు. తమకూ ఇలాగే జరిగిందని యూజర్లు రిప్లై ఇచ్చారు. మీకూ ఇలాగే జరిగిందా?

error: Content is protected !!