News March 13, 2025

వికారాబాద్: నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: డీపీవో

image

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వంద శాతం ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి, డాక్టర్ జయసుధ సూచించారు. ఆమె ధారూర్ మండలంలో గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. చింతకుంట, కెరెల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

Similar News

News March 8, 2026

NLG: ఆర్టీసీ ప్రగతి చక్రంలోనూ నారీశక్తి..!

image

TG-RTC అభ్యున్నతిలో మహిళా ఉద్యోగులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో మహిళా సిబ్బంది తమ పనితీరుతో సంస్థకు ఆదాయ వనరులుగా మారారు. 7 డిపోలలో కలిపి మొత్తం 328 మంది మహిళలు విధుల్లో ఉన్నారు. వీరిలో 308 మంది కేవలం కండక్టర్లుగానే సేవలందిస్తూ బస్సులను లాభాల బాటలో నడిపిస్తున్నారు. అత్యధికంగా నల్గొండ డిపోలోనే 80 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండటం విశేషం.

News March 8, 2026

CA ఫలితాలు విడుదల

image

ఛార్టర్డ్ అకౌంటెన్సీ(CA) ఫలితాలను ICAI రిలీజ్ చేసింది. ఫౌండేషన్, ఇంటర్ పరీక్షల రిజల్ట్స్‌ను <>వెబ్‌సైట్‌<<>>లో ఉంచినట్లు తెలిపింది. అలాగే ఆలిండియా మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచింది. జనవరి 18, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు జరిగాయి. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ICAI ఏటా 3 సార్లు(జనవరి, మే/జూన్, సెప్టెంబర్) ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంది.

News March 8, 2026

బోరవెల్లి ‘కవిపోషక రాణి’ గిరియమ్మ

image

రాజకుమారి గిరియమ్మ బోరవెల్లి కోట సంస్థాన చినసోమభూపాలుడి భార్య. సంతానం లేకపోవడంతో పెద్దసోమభూపాలుని కుమారుడు వెంకటపతిని దత్తత తీసుకున్నారు. గద్వాల కవులు-పండితులను పోషించి కవిపోషక రాణిగా పేరు తెచ్చుకున్నారు. దత్తపుత్రుడు వెంకటపతి కూడా తల్లికి తగ్గట్టుగా సాహిత్యాన్ని ఆదరించారు. 1668లో వెంకటపతి సంస్థానాన్ని గద్వాలలో విలీనం చేసి తన పుట్టినిల్లు గద్వాల సంప్రదాయాన్ని బోరవెల్లిలో తెచ్చి కీర్తిని తెచ్చారు.