News March 13, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత కొద్దిరోజులుగా పత్తి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,960 పలకగా.. మంగళవారం రూ.6,950కి పడిపోయింది. మళ్లీ బుధవారం రూ.6,960 కాగా.. ఈరోజు మళ్లీ రూ.6,950కి చేరింది. ధర ఏడు వేల దిగువకు పడిపోవడంతో పత్తి పండించిన రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Similar News
News November 12, 2025
నిర్మల్: 14న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఈనెల 14న ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని జిల్లా విద్యాధికారి భోజన్న బుధవారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సమావేశం నిర్వహించే విద్యార్థుల ప్రగతిని వారికి వివరించాలన్నారు.
News November 12, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News November 12, 2025
కేయూలో భవనం కోసం భారీ వృక్షాలు కట్!

కాకతీయ యూనివర్సిటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. కొత్త విద్యుత్ లైను పేరుతో ఏళ్ల నాటి చెట్లను నరికివేయడంపై అసహనం వ్యక్తమవుతోంది. ఓ భవన నిర్మాణం కోసమని ఇప్పటికే భారీ వృక్షాలను నరికివేసిన అధికారులు.. ఇప్పుడు అదే భవనం కోసం పాత విద్యుత్ లైనునే మార్చివేసి కొత్తది వేశారు. ఇందుకోసం వర్సీటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేయడంపై ప్రకృతి ప్రేమికులు భగ్గుమంటున్నారు.


