News March 13, 2025

భద్రాచలంలో పోస్టులు.. మార్చి 19న ఇంటర్వ్యూలు

image

ఖమ్మం రీజియన్‌లోని ఏకలవ్య పాఠశాలల్లో కౌన్సిలర్ పోస్టుల భర్తీ కోసం ఔట్‌సోర్సింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో పీ.రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19న తేదీన ఉదయం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Similar News

News July 4, 2025

రాష్ట్రంలో 3 దాడులు.. 6 కేసులు: అంబటి

image

AP: రాష్ట్రంలో పరిస్థితి మూడు దాడులు.. ఆరు కేసుల మాదిరిగా తయారైందని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. రోజూ ఎక్కడో ఓ చోట YCP కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ‘రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు, రిటైర్డ్ ఆఫీసర్లు కలిసి పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపటం లేదు. ఎవరు చంపుకున్నా YCP నేతలపైనే కేసులు పెడుతున్నారు. కూటమి సర్కార్ తాటాకు చప్పుళ్లకు తాము భయపడం’ అని స్పష్టం చేశారు.

News July 4, 2025

జగిత్యాల : రోశయ్య జయంతి సందర్భంగా SP ఘన నివాళి

image

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కె.రోశయ్య జయంతిని జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి SP అశోక్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారన్నారు.

News July 4, 2025

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: కలెక్టర్

image

లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.‌ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.