News March 23, 2024
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి: కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రామగుండం మున్సిపల్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చందర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు.
Similar News
News October 2, 2024
కేటీఆర్పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై జరిగిన దాడిని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ ఇదేనా అని కాంగ్రెస్ను ప్రశ్నించారు.
News October 2, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ధర్మపురి మండలంలో విద్యుత్ షాక్తో గేదె మృతి.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ వేములవాడలో పర్యటించిన దేవాదాయ, జౌలి చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.
@ వేములవాడ ఏరియా ఆసుపత్రికి మూడవసారి కాయకల్ప అవార్డు.
News October 1, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.82,779 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,632, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.20,000, అన్నదానం రూ.17,147 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.