News March 13, 2025

పిల్లలను దండించే అధికారం గురువులకు లేదా?

image

1990, 2000లలో గురువులంటే పిల్లలకు ఎంతో గౌరవం, భయం ఉండేవి. పిల్లలు సరిగా చదవకున్నా, అల్లరి చేసినా మందలించమని తల్లిదండ్రులు టీచర్లకు చెప్పేవారు. వారి భరోసాతో ఉపాధ్యాయులు విద్యార్థులను దారిలోకి తెచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పిల్లలపై చేయి వేద్దామంటేనే <<15742695>>ఉపాధ్యాయులు<<>> జంకాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులకూ పిల్లలపై నియంత్రణ ఉండట్లేదు. మీ కామెంట్?

Similar News

News March 13, 2025

అసెంబ్లీ: బీఆర్ఎస్‌ఎల్పీలో ఉద్రిక్తత

image

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తనపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వెళ్లి బీఆర్ఎస్‌ఎల్పీలోని కేసీఆర్ ఛాంబర్‌లో కూర్చున్నారు. అయితే ఆయన వద్దకు వెళ్లిన మార్షల్స్ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. దీంతో జగదీశ్, కేటీఆర్, హరీశ్, తలసాని వారితో వాగ్వాదానికి దిగారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కూర్చుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు.

News March 13, 2025

2లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

image

AP: ఏఐ, డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2లక్షలమందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో APSSD ఒప్పందం చేసుకొంది. 50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ, 10వేల మంది విద్యార్థులకు ఏఐ , క్లౌడ్ కంప్యూటరింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వనుంది. అదే విధంగా 30 ఐటీఐల్లో 30వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

News March 13, 2025

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

error: Content is protected !!