News March 13, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా తగ్గిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకి బుధవారం రూ.13,400 ధర రాగా.. నేడు రూ.13,300కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.16,500 ధర పలకగా ఈరోజు రూ.16,100 పలికినట్లు వచ్చినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డి: 20న ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు ఈనెల 20న సంగారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బాలబాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9494991828 నెంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News September 18, 2025
బీడీ కార్మికుల పిల్లలకు మరో అవకాశం..!

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు జగిత్యాల బీడీ కార్మికుల దవాఖానా మెడికల్ ఆఫీసర్ డా.శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాల పేరు పోర్టల్లో కనిపించకపోతే సమస్యలను wclwohyd@nic.inకు పంపాలన్నారు. సందేహాలుంటే 9966621170కు కాల్ చేయవచ్చన్నారు.
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.