News March 13, 2025
భువనగిరి: పీఎం శ్రీ పథకం ఎంతో ప్రయోజనకరం

యాదాద్రి జిల్లాలో పీఎం శ్రీ పథకానికి మొదటి విడతలో 17 పాఠశాలలకు, రెండో విడతలో 8 పాఠశాలలకు చోటు దక్కింది. విద్యారంగంలో మార్పులు తీసుకురావడం, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకంతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పథకం గ్రామీణ ప్రాంత పాఠశాలల బలోపేతానికి, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడానికి దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.
Similar News
News September 17, 2025
నిజాం కాలం నాటి ఆసిఫాబాద్ జైలు

ఆసిఫాబాద్ జిల్లాలోని జన్కాపూర్లో 1916లో ఐదెకరాల్లో నిర్మించిన జైలు భవనం చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. డంగు సున్నంతో నిర్మించిన ఇందులో 200 మంది ఖైదీలు ఉండేలా మూడు బారక్లు ఉన్నాయి. 1991లో మరమ్మతులు చేసి తిరిగి ప్రారంభించగా, 2008లో జిల్లా జైలు తరలింపు తర్వాత ఇది సబ్ జైలుగా రూపాంతరం చెందింది. ఈ భవనం ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది.
News September 17, 2025
వరంగల్: ట్రెండ్ ఫాలో అవ్వండి.. కానీ మోసపోకండి..!

‘సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫొటోలు, లింకుల కోసం అపరిచిత వెబ్సైట్లను ఆశ్రయించకండి. తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింకులపై క్లిక్ చేయకండి’ అని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తపడాలని, ఏ వెబ్సైట్ అయినా యూఆర్ఎల్ను రెండుసార్లు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలని తమ అధికారిక X ఖాతా ద్వారా ప్రజలకు సూచించారు.
News September 17, 2025
జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.