News March 13, 2025
మహిళా ఎస్సైపై దాడి చేసిన ఆకతాయిలు

AP: విజయనగరం జిల్లాలో అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్సైపై ఆకతాయిలు దాడి చేశారు. వేపాడ మండలంలో జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసభ్యంగా డాన్స్ చేశారు. దీనిని మహిళా ఎస్సై అడ్డుకోవడంతో ఆమెను జుట్టు పట్టుకొని లాగారు. అనంతరం ఆమెపై దాడిచేసి తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు. మహిళా ఎస్సైని ఆసుపత్రికి తరలించారు
Similar News
News March 17, 2026
APPLY: ప్రతినెలా రూ.3,000 పెన్షన్

చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించేందుకు కేంద్రం ‘PM-Kisan Maandhan Yojana’ను అమలు చేస్తోంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 18-40ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 చొప్పున పొదుపు చేయాలి. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందవచ్చు. రైతు మరణిస్తే భాగస్వామికి 50% పెన్షన్ అందిస్తారు. రైతులు ఆధార్, బ్యాంక్ వివరాలతో ‘మీసేవ’, CSC కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు.
News March 17, 2026
ఓరల్ సెక్స్తో పెరుగుతున్న గొంతు క్యాన్సర్

ఇండియాలో గొంతు క్యాన్సర్కు పొగ తాగడం, పొగాకు నమలడం ప్రధాన కారణాలు. ఇప్పుడు US, UKలో ఓరల్ సెక్స్ ద్వారా అధిక సంఖ్యలో HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిలో HPV-16, HPV-18 రకాలు గొంతు క్యాన్సర్కు దారితీస్తున్నాయంటున్నారు. ఎక్కువ మందితో లైంగిక సంబంధం, HPV వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
News March 17, 2026
ఇమామ్, మౌజన్లకు రూ.45 కోట్లు విడుదల

AP: రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం రూ.45 కోట్లను విడుదల చేసింది. 5వేల మంది ఇమామ్లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్ల అకౌంట్లలో రూ.15 కోట్లు జమ చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డబ్బులు రిలీజ్ చేసింది.


