News March 13, 2025

యాదాద్రి: ట్యాంకర్లతో పొలాలు తడుపుతున్నారు

image

భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలు తడుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేసి పంట పొలాలను తడుపుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. 

Similar News

News March 13, 2025

SKLM: మహిళల భద్రత కోసం శక్తి యాప్- ఎస్పీ

image

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికలు భద్రత కోసం శక్తి యాప్ (SHAKTI APP)ను ప్రవేశపెట్టిందని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, ఇతర హింసాత్మక ఘటనలను నివారించటానికి ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో ప్రతీ మహిళ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 13, 2025

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అందుకు సంబంధించి పనుల అనుమతులను జాప్యం చేయక సంబంధిత అధికారులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు, పౌర సరఫరాల పంపిణీ తదితరులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ఎలాంటి జాప్యానికి తావివ్వక వెంటనే దరకాస్తును పరిశీలించి పనులకు అనుమతి ఇవ్వాలన్నారు.

News March 13, 2025

KMR: భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తాం: కలెక్టర్

image

రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో ITI ల ఏర్పాటుకు అవసరమైన రెండు ఎకరాల చొప్పున భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. బిచ్కుందలో ITI ఉందని తెలిపారు.

error: Content is protected !!