News March 13, 2025

వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

image

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.

Similar News

News November 6, 2025

అమలాపురం: 8న డీఆర్‌సీ సమావేశం

image

జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశం అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ గురువారం తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్న నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 6, 2025

KGF నటుడు కన్నుమూత

image

కేజీఎఫ్ నటుడు <<17572420>>హరీశ్ రాయ్<<>> కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. KGF-1లో హరీశ్ రాయ్.. ఛాఛా అనే పాత్రలో నటించారు. రెండో పార్ట్ రిలీజైన నాటికే ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది నాలుగో స్టేజీకి చేరడంతో పూర్తిగా బక్కచిక్కిపోయారు. ఆర్థిక సాయం చేయాలని కోరగా నటుడు ధ్రువ్ సర్జా హెల్ప్ చేశారు. పరిస్థితి చేజారిపోవడంతో ఆయన మరణించారు.

News November 6, 2025

RGM: రోజుకు 2.75లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తేనే టార్గెట్ రీచ్

image

సింగరేణి వ్యాప్తంగా(2025- 26) ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను నిర్దేశించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో 11 డివిజన్లలో గడిచిన 7 నెలల్లో 32.64 MTల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించింది. ఇకపై టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.75లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.