News March 13, 2025

వైకుంఠపురం డీపీఆర్ రూపొందిస్తున్నాం: మంత్రి

image

AP: వైకుంఠపురం బ్యారేజ్ పునర్నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 15లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉండేదని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందని అసహనం వ్యక్తం చేశారు.

Similar News

News March 14, 2026

1.71 కోట్ల ORS ప్యాకెట్లు సిద్ధం: సత్యకుమార్

image

AP: సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ‘అవేర్ ప్లాట్‌ఫాం ద్వారా 4-5 రోజుల ముందుగానే ఉష్ణోగ్రతల అప్డేట్ ఇస్తాం. వడదెబ్బకు గురైతే తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధులపై మెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. 1.71Cr ORS ప్యాకెట్లను ఆస్పత్రులకు పంపాం. గర్భిణులు, వృద్ధులు, శిశువులు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులకు వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తాం’ అని పేర్కొన్నారు.

News March 14, 2026

సూర్య కొత్త సినిమాపై అప్డేట్

image

సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ టీజర్‌ను ఈ నెల 16న సా.4.06 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకు జోడీగా మమిత బైజు నటిస్తుండగా రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. GV ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 14, 2026

సోదరిని 84 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు!

image

తనతో పాటు పుట్టిన సోదరిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపిన ఘటన UPలో జరిగింది. కవల సోదరి హిమాన్షిక(25)తో పాటు హార్దిక్ ఏడాదిన్నర కిందటి వరకు ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జాబ్ మానేశాక SMలో ఎక్కువ టైమ్ గడపడం, ఓ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయంలో సోదరుడిని హిమాన్షిక మందలించింది. కక్ష పెంచుకున్న అతను సోదరిపై 84సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి డెడ్‌బాడీ చూపించి ఆమెపైనా దాడి చేశాడు.