News March 13, 2025
లోకేశ్వర్ రెడ్డిపై దాడి టీడీపీ నేతల పనే: YCP

కోవెలకుంట్ల మం. కంపమల్లలో YCP <<15743280>>నేత<<>> లోకేశ్వర్ రెడ్డిపై TDP నేతలే హత్యాయత్నం చేశారని YCP ఆరోపించింది. ‘పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. అతని ఇంటిపైనా దాడికి పాల్పడటంతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News March 6, 2026
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు!

TG: రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో <<19171673>>ఫీజులు పెరిగాయి<<>>. ప్రస్తుత, వచ్చే విద్యా సంవత్సరాలకు సంబంధించి 160 కాలేజీల ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. TAFRC సిఫార్సుల మేరకు అత్యల్పంగా ₹45 వేలు, అత్యధికంగా ₹1.83 లక్షలుగా నిర్ణయించింది. CBIT(₹1.83 లక్షలు), వాసవి(₹1.75 లక్షలు), MGIT(1.67 లక్షలు), CVR(₹1.63 లక్షలు)లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. 35కు పైగా కాలేజీల్లో ₹లక్షకు పైనే ఉండటం గమనార్హం.
News March 6, 2026
రష్యా క్రూడాయిల్ వచ్చేస్తోంది!

అమెరికా <<19308509>>ఆంక్షల సడలింపు<<>>తో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది. 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్బర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.
News March 6, 2026
తిరుపతి: రేపే మహిళా యూనివర్సిటీ కాన్వకేషన్

తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం 22వ కాన్వకేషన్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మొత్తం 1,601 మందికి డిగ్రీ పట్టాలు అందజేస్తామని తెలిపారు.


