News March 13, 2025
పోతారు.. మొత్తం పోతారు: యూఎన్ చీఫ్ హెచ్చరిక

దేశాలు వాణిజ్య యుద్ధాల్లోకి దిగడం ఎవరికీ మంచిది కాదని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. సుంకాల పోరు అన్ని దేశాలనూ దెబ్బ కొడుతుందని పేర్కొన్నారు. ‘మనం నేటికాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బతుకుతున్నాం. అన్ని దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. స్వేచ్ఛాయుత వాణిజ్యం అందరికీ ఉపయోగం. అదే వాణిజ్య యుద్ధంలోకి వెళ్తే విజేతలెవరూ ఉండరు’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 18, 2026
రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 18, 2026
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సి విటమిన్లు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. బియ్యం కడిగిన నీళ్లను తలకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్ఫ్లేషన్గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


