News March 13, 2025
స్పీకర్ అలా వ్యవహరించకపోతే అవిశ్వాసం పెడతాం: హరీశ్ రావు

TG: స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. ‘సభ మీ ఒక్కరిది కాదు అందరిదీ అని జగదీశ్ రెడ్డి అన్నారు. “నీ” అన్న మాట ఆయన అనలేదు. “మీ” అనే పదం సభ నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసనలు చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.
News February 10, 2026
మరోసారి తెరపైకి మైసూర్ సోప్, తమన్నా వివాదం

మైసూర్ శాండల్ సోప్కు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నాను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. KN ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేసే సబ్బుకు ముంబైలో పుట్టిన తమన్నాను రూ.6.2 కోట్ల కాంట్రాక్ట్కు నియమించడం కాంగ్రెస్ నాయకుల యాంటీ కన్నడ మైండ్సెట్కు నిదర్శనమని బీజేపీ ఎంపీ కె.సుధాకర్ ఆరోపించారు. 2025, మేలో ఓకే అయిన ఈ కాంట్రాక్ట్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.
News February 10, 2026
విశాఖకు మెట్రో రైలు.. 3 రూట్లు ఇవే

AP: సుమారు 46KM పొడవు, 3 కారిడార్లు, రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో విశాఖ మెట్రోకు కేంద్రం ఓకే చెప్పింది.
*30-35KM దూరంతో స్టీల్ ప్లాంట్(గాజువాక)-కొమ్మాది మధ్య అత్యంత పొడవైన కారిడార్ ఏర్పాటు కానుంది.
*సిటీలో ట్రాఫిక్ తగ్గించేందుకు 5-6KM దూరంతో గురుద్వారా జంక్షన్-ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ రానుంది.
*6-7KM దూరంతో పర్యాటకం+సిటీని కలుపుతూ తాటిచెట్లపాలెం-RK బీచ్ వరకు మూడో కారిడార్ వస్తుంది.


