News March 13, 2025

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిత్య కళ్యాణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో గురువారం నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శన భాగ్యం పొందారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Similar News

News March 13, 2025

IPLకు మార్క్‌వుడ్ దూరం!

image

IPL టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ టోర్నీకి దూరం కానున్నారు. మోకాలికి గాయం కావడంతో ఆయన సర్జరీ చేయించుకున్నారు. దీంతో 4 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. IPL మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. కానీ ఆయన ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. ఫ్రాంచైజీ ఆయన స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంది.

News March 13, 2025

నాసిరకం మద్యానికి 33 వేల మంది బలి: జీవీ

image

AP: YCP హయాంలో నాసిరకం మద్యం సేవించి 33 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో కోరారు. ‘జగన్ హయాంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్లు ఎక్కువగా మద్యం కుంభకోణం జరిగింది. ఈ స్కామ్ ద్వారా YCP నేతలు రూ.వేల కోట్లు గడించారు. దీనిపై EDతో విచారణ చేయించాలి. దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ప్రజలకు పంచాలి’ అని పేర్కొన్నారు.

News March 13, 2025

14405 టోల్ ఫ్రీపై విస్తృత ప్రచారం కల్పించాలి: కలెక్టర్

image

నాటు సారా సంబంధిత ఫిర్యాదులకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించి సారారహిత జిల్లాగా పార్వతీపురం మన్యంకు గుర్తింపు తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. గురువారం ఇందుకు సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను ఆయన విడుదల చేశారు. పోలీసులు నాటు సారా గ్రామాలను దత్తత తీసుకోవాలని అన్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంగా విస్తృత దాడులు చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!