News March 13, 2025
KKR కెప్టెన్గా రహానే.. కారణం ఇదే

కెప్టెన్సీలో అనుభవం ఉన్న కారణంగానే తమ జట్టు కెప్టెన్గా రహానేను నియమించామని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. ‘కెప్టెన్సీ అంటే ఒత్తిడి ఉంటుంది. అది యంగ్ ప్లేయర్లకు భారం. పైగా ఆక్షన్ తర్వాత జరిగే సీజన్ కాబట్టి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. అలాగే ప్లేయర్ల నుంచి బెస్ట్ను రాబట్టగలగాలి. అందుకే అనుభవమున్న రహానేను ఎంచుకున్నాం. V అయ్యర్ కూడా కెప్టెన్సీ మెటీరియల్. అతను రహానే నుంచి నేర్చుకుంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
2100 నాటికి భారత జనాభా 153కోట్లు!

ఇండియాలో ప్రస్తుతం 140+ కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. అయితే, 2100 నాటికి ఇది 153.3 కోట్లకు చేరుతుందని UN పాపులేషన్ డివిజన్ పేర్కొంది. దీంతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా మారనుంది. చైనాలో మాత్రం జననాల రేటు పడిపోయి అక్కడి జనాభా 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత నైజీరియాలో 54 కోట్లు, పాకిస్థాన్లో 48 కోట్లు, కాంగోలో 43కోట్లు, అమెరికా 39కోట్ల మంది జనాభాకు చేరుకుంటుందని వెల్లడించింది.
News March 13, 2025
IPL: సూపర్ పవర్స్ ఉంటే మీరేం చేస్తారు?

క్రికెట్ అభిమానుల పండుగైన ‘IPL’ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఈసారైనా కప్ కొట్టేలా RCB వ్యూహాలను రచిస్తోంది. అయితే, మీకే సూపర్ పవర్స్ ఉంటే కిందివాటిలో ఏది చేస్తారు? 1.RCB తొలి ట్రోఫీని గెలవటం. 2. ధోనీ తన తొలి IPL సెంచరీని కొట్టడం. 3. రోహిత్ బ్యాటింగ్తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సాధించడం. 4. SRH 300 రన్స్ను దాటేయడం. COMMENT
News March 13, 2025
ఆ పాత సామాను ఎవరు?

అవసరమైతే పార్టీపైనే విమర్శలు చేసే BJP MLA రాజాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కాషాయ దళంలోని పాత సామాను బయటకు వెళ్లాలన్నారు. కొన్ని సామాజిక వర్గాల్లోని కొందరు పార్టీని సొంత జాగీరుగా భావిస్తున్నారని ఆరోపించారు. దీంతో నాయకుల్లో రెడ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్ర కమలదళ నేతల్లో ఎవరిని ఉద్దేశించి గోషామహల్ నేత ఈ పాత సామాను కామెంట్లు చేశాడని సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది.