News March 13, 2025
కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News January 11, 2026
నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.
News January 11, 2026
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అన్నమయ్య ఎస్పీ

సంక్రాంతి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి ధీరజ్ ఒక ప్రకటనలో కోరారు. పండగ ఆఫర్లు, ఉచిత గిఫ్టులు, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేస్తే భారీగా నష్టపోవడం ఖాయమన్నారు. అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వరాదని స్పష్టం చేశారు. మోసపోయిన వారు వెంటనే 1930కి సమాచారం ఇవ్వాలన్నారు.
News January 11, 2026
తాగునీటి భద్రతకు బల్దియాలో ‘వాటర్ రింగ్ మెయిన్’

బల్దియా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా జలమండలి భారీ కసరత్తు మొదలుపెట్టింది. రూ.7,200CRతో 158KM ‘వాటర్ రింగ్ మెయిన్’కు రూపకల్పన చేసింది. నగరం చుట్టూ జలవలయంగా పైపులైన్ ఏర్పాటు చేసి గోదావరి, కృష్ణా, మంజీరా, ఉస్మాన్, హిమాయత్సాగర్ వనరులను క్లోజ్డ్ లూప్ విధానంలో అనుసంధానించనుంది. 18KM పనులు పూర్తవగా, మిగిలిన పనులకు DPRతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. నగర భవిష్యత్ నీటి అవసరాలకు ఇది కీలకం కానుంది.


