News March 13, 2025

ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండుగను శుక్రవారం ఉదయం 6:00 గంటల నుంచి మ.12 గంటల వరకు చేసుకోవాలని సురక్షితమైన రంగులను ఉపయోగించాలని హానికరమైన రసాయనాలను రంగులను వాడకూడదని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధిస్తున్నాని, అలాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2025

2100 నాటికి భారత జనాభా 153కోట్లు!

image

ఇండియాలో ప్రస్తుతం 140+ కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. అయితే, 2100 నాటికి ఇది 153.3 కోట్లకు చేరుతుందని UN పాపులేషన్ డివిజన్ పేర్కొంది. దీంతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా మారనుంది. చైనాలో మాత్రం జననాల రేటు పడిపోయి అక్కడి జనాభా 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత నైజీరియాలో 54 కోట్లు, పాకిస్థాన్‌లో 48 కోట్లు, కాంగోలో 43కోట్లు, అమెరికా 39కోట్ల మంది జనాభాకు చేరుకుంటుందని వెల్లడించింది.

News March 13, 2025

సీఎంఆర్ చెల్లించకుంటే కఠిన చర్యలు: అ.కలెక్టర్

image

వికారాబాద్: సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు సకాలంలో అందించాలని, చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్, పౌరసరఫరాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించిన సివిల్ సప్లై ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 13, 2025

హోలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: CP

image

హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో ప్రాజెక్టులలో స్నానాలు చేయునప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పారు.

error: Content is protected !!