News March 13, 2025
బాపట్ల: ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ జర్నీ

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 16,799 (8482 విద్యార్థులు, విద్యార్థినిలు 8317) మంది 103 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్పై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.
Similar News
News March 24, 2026
కోనసీమ: భద్రాచలం శ్రీరామ నవమికి ఈ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి భద్రాచలానికి 15 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 26 నుంచి అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం డిపోల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అమలాపురం డిపో నుంచి 26న ఉదయం 9:30, 10:30, మధ్యాహ్నం 12:30, 1:30, 3:00 గంటలకు బస్సులు బయలుదేరుతాయని ఆయన పేర్కొన్నారు.
News March 24, 2026
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో గూగుల్ మీట్ ద్వారా భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలాల వారీగా అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.
News March 24, 2026
కేజీబీవీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా, వైద్య సేవల అమలును సమగ్రంగా పరిశీలించారు.


