News March 13, 2025
GWL: ‘గ్రామీణ నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్లు నెలకొల్పాలి’

రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన కార్యాలయం నుంచి కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. గద్వాల కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొని జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటుకు అవకాశం ఉందని వివరించారు.
Similar News
News March 24, 2026
72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్ను అమల్లోకి తేనుంది.
News March 24, 2026
సేద్యంపై ‘శాపం’.. ఎండిపోతున్న పైర్లు

నల్గొండ జిల్లాలో సాగునీరు అందక పంట పొలాలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అల్లాడిపోతున్నారు. మునుగోడు మండలం ఉకోండిలో భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు పోయక పరిస్థితి దారుణంగా మారింది. చేతికొచ్చే దశలో వరి, ఇతర పంటలు ఎండుతుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కేలా లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఇబ్బందులను తొలగించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
News March 24, 2026
సంచలనం.. యుద్ధంలోకి సౌదీ, UAE?

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తోన్న దాడుల్లో సౌదీ, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ‘వాల్స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని టెహ్రాన్కు చెందిన ఆస్పత్రి, క్లబ్ను UAE మూసేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించడం తెలిసిందే.


