News March 13, 2025

MHBD: మటన్ కోసం మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు

image

మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మటన్ కోసం భార్యను మర్డర్ చేసిన వ్యక్తిని సీరోల్ పోలీస్‌లు గురువారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత అందరి పైన ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News September 15, 2025

విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

image

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్‌టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 15, 2025

గద్వాల: రుణాలు సకాలంలో మంజూరు చేయాలి: కలెక్టర్

image

గద్వాల జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు అన్ని బ్యాంకులు రైతులకు పంట, అనుబంధ రంగాల రుణాలు, ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్యా, గృహ రుణాలు తదితర ప్రాధాన్యతా రంగాల రుణాలను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ మల్లు రవితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు.

News September 15, 2025

ములుగు: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సీతక్క

image

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో ములుగు జిల్లాలో జరిగే కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అతిధి చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించడం, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది.