News March 13, 2025
పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. పది పరీక్షలపై గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అసౌకర్యం కలకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
Similar News
News March 14, 2025
విశాఖ జూలో చిరుత మృతి.. కారణమిదే..!

విశాఖ జూ పార్క్లో 2008 నుంచి ఉంటున్న ‘సుధ’ అనే ఆడ చిరుతపులి గురువారం సాయంత్రం మృతి చెందినట్లు జూక్యూరేటర్ మంగమ్మ వెల్లడించారు. 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ చిరుత మయోకార్డియల్ ఇన్ఫార్జన్ డిసీజ్ కారణంగా మృతి చెందినట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ వెల్లడించారన్నారు. దీని సగటు జీవిత కాలం 12 నుంచి 15 సంవత్సరాలు కాగా జూ సంరక్షణలో ఉండడంతో 20 సంవత్సరాలు జీవించిందన్నారు.
News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.
News March 14, 2025
ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.