News March 13, 2025

ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: హీరోయిన్

image

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారోనని భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్ల తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News September 14, 2025

ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్‌2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.

News September 14, 2025

జొన్న: కాండం తొలుచు పురుగు.. నివారణ

image

* పంట వేసిన 35 రోజుల నుంచి కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఎకరానికి 4 కేజీల కార్బోఫ్యూరాన్ 3సిజి గుళికలను కాండం సుడుల్లో వేయాలి.
* కత్తెర పురుగు లార్వా దశలో ఉంటే వేపనూనె(అజాడిరక్టిన్) 1500 పిపిఎం 5 ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పురుగు తీవ్రత అధికంగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ML, ఒక లీటరు నీటికి కలిపి సుడుల్లో పడేలా పిచికారీ చేయాలి.

News September 14, 2025

కొడుకును చంపి నదిలో పడేశాడు!

image

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.