News March 13, 2025

సిరిసిల్ల: ఉపాధ్యక్షురాలుగా లావణ్య లింగారెడ్డి

image

సిరిసిల్ల జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా తంగళ్ళపల్లికి చెందిన ఆసాని లావణ్య లింగారెడ్డిని నియమించినట్టు జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో లావణ్య లింగారెడ్డికి ఆమె గురువారం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 27, 2025

ఖమ్మంలో క్లాక్‌ టవర్.. స్పెషాలిటీ ఇదే

image

ఖమ్మానికి కొత్తశోభ రానుంది. నగరంలోని ఇల్లందు క్రాస్‌రోడ్‌లో రూ. 1.25కోట్లతో క్లాక్ టవర్ నిర్మించనున్నారు. నిర్మాణానికి ప్రపంచగుర్తింపు పొందిన బ్లాక్ గ్రానైట్ రాయిని ఉపయోగించడంతో పాటు స్తంభాద్రి నరసింహస్వామి, ఖిల్లా, ఇతర చారిత్రక అంశాలు ప్రతిబింబించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయితే నగరానికి ల్యాండ్ మార్క్‌గా నిలవనుంది. ఇప్పటికే నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

News October 27, 2025

జూబ్లీహిల్స్‌లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

News October 27, 2025

జూరాల ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

image

జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.275 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపారు. ఇన్ ఫ్లో 25 వేల క్యూసెక్కులు కాగా, పవర్ హౌస్‌లకు 23,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ ఫ్లో 23,105 క్యూసెక్కులుగా ఉందన్నారు. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు అన్ని గేట్లను నిలుపుదల చేశారు.