News March 13, 2025
ఉద్యోగుల మధ్య జీతాల తేడాలొద్దు: నారాయణ మూర్తి

ఉద్యోగుల మధ్య జీతాల తేడా ఉండకూడదని, వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అన్నారు. తక్కువ, ఎక్కువ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ ఈవెంట్లో అభిప్రాయపడ్డారు. ‘ప్రతి ఉద్యోగి గౌరవం, హుందాతనాన్ని కాపాడాలి. వారిని ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, మందలించేటప్పుడు ఏకాంతంగా చెప్పాలి. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికీ సమానంగా అందించాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2025
MLAలు రూ.800కోట్లు డిమాండ్ చేస్తున్నారు: DK శివకుమార్

బెంగళూరులో చెత్త సంక్షోభంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Dy.CM DK శివకుమార్ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలంతా కలసి సిటీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.800 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్గా మారి సాధారణ ధరల కంటే 85శాతం అధికంగా కోట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారన్నారు.
News March 15, 2025
మార్చి15: చరిత్రలో ఈరోజు

*1493: మెుదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్
*1564: జిజియా పన్ను రద్దు
*1934: బీఎస్పీ పార్టీ స్థాపకుడు కాన్షీరాం జననం
*1937: తెలుగు సాహితి విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
* 1950: ప్రణాళిక సంఘం ఏర్పాటు
*1983: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
*1990: సోవియట్ యూనియన్ మెుదటి అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక
News March 15, 2025
RRR, పుష్ప ఫలితాలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

కథ బాగా చెప్తే ఏ భాషలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా సినిమా ఆడుతుందని హీరో మంచు విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు. బాహుబలి, RRRలే సినిమాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. RRR సినిమాలోని అల్లూరి, కొమురంభీం గురించి తెలుగు వారికి తప్ప ఎవరికీ తెలియదని కథ చెప్పే విధానం వల్లే సూపర్ హిట్గా నిలిచాయన్నారు. అదే కారణంతో పుష్ప సినిమా కూడా తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయిందని అని చెప్పారు.