News March 13, 2025
కరీంనగర్: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: సిపి గౌస్ ఆలం

శుక్రవారం జరుపుకోనున్న హోలీ పండుగను సురక్షితంగా, బాధ్యతతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. బలవంతంగా ఇతరులపై రంగులు వేయవద్దని, ఘర్షణ వాతావరణంలో పండగను జరుపుకోవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి హోలీ పండుగను రంగుల మయంగా ఆనందకరంగా జరుపుకోవాలని అన్నారు. స్నానానికి ప్రమాదకరమైన నీటిలో దిగవద్దని తెలిపారు.
Similar News
News September 12, 2025
కరీంనగర్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా రమేశ్

కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్హెచ్ఓగా డీఎస్పీ కోత్వాల్ రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్హెచ్ఓగా పనిచేసిన డీఎస్పీ నరసింహారెడ్డి హైదరాబాద్ సీసీఎస్కి బదిలీ కాగా ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో డీఎస్పీగా పనిచేసిన రమేశ్ కరీంనగర్కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమేశ్ సీపీ గౌస్ ఆలంను మర్యాద పూర్వకంగా కలిశారు.
News September 11, 2025
కరీంనగర్: నిరుపయోగంగా నూతన అంబేడ్కర్ భవనం

కరీంనగర్ పరిధి చింతకుంటలో నిర్మించిన నూతన అంబేడ్కర్ భవనం ప్రారంభమై, సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ ఉపయోగంలోకి రాకపోవడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ 2023 అక్టోబర్లో ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవం తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పూర్తిగా నిరుపయోగంగా మారింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News September 11, 2025
KNR: ‘డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల’

2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిందని SRR ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. దోస్త్ వెబ్ సైట్లో ఖాళీల వివరాలు అందుబాటులో ఉంటాయని, స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ విద్యార్థులకు SEP 15, 16వ తేదీల్లో జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.