News March 13, 2025
PPM: ‘మార్చి 23 నాటికి గృహ నిర్మాణాల సర్వే పూర్తి చేయాలి’

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను మార్చి 23 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గిందని, ఇసుక లభ్యంగా ఉందన్నారు. ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగాయని అన్నారు.
Similar News
News March 5, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

<
News March 5, 2026
9న భీమవరం వస్తున్న షర్మిల!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఈనెల 9న భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కాళ్ల మండలంలో రచ్చబండ, భీమవరం ప్రకాశం చౌక్ నుంచి కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంకెం సీతారామ్ గురువారం తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
News March 5, 2026
ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.


