News March 13, 2025
రామగుండం: కమిషనరేట్ పరిధిలోని SIలతో CPసమావేశం

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐలతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPమాట్లాడుతూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని, తద్వారా విలువైన సమాచారం లభిస్తుందని అన్నారు. ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
Similar News
News March 16, 2026
‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం పడుతుంది.
News March 16, 2026
ఏలూరు జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

ఏలూరు జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, సరఫరాలో ఇబ్బందులున్నా వినియోగదారులు జిల్లా పౌరసరఫరాల కార్యాలయ కంట్రోల్ రూమ్ నంబర్ 7569296272 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
News March 16, 2026
GNT:”ఎస్పీ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ రద్దు”

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దైంది.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని SP వకుల్ జిందాల్ సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను ముందు రోజు వెళ్లడిస్తామని చెప్పారు.


