News March 13, 2025

పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

image

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.

Similar News

News March 10, 2026

ఎన్టీఆర్: పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో ఎం.టెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 23, 25, 28, 30, ఏప్రిల్ 1, 6వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 60 మార్కులకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.

News March 10, 2026

ఇంద్రకీలాద్రిపై పుష్పార్చనల వివరాలు ఇవే

image

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19న ప్రారంభం కానున్న వసంత ఉత్సవాలలో రోజుకొక పూలతో అర్చన చేయనున్నారు. 19న మరువం, మల్లెలు, 20న గులాబీ, కనకాంబరం, 21న చామంతి, 22న ఎర్ర కలువ, మందారం, 23న తెల్లజిల్లేడు, మరువం, మారేడు, తులసి, 24న కాగడా మల్లె, జాజి, 25న సన్నజాజి, ఎర్రటి గన్నేరు, తామర, 26న సంపెంగ, చామంతి, 27న గులాబీ, కనకాంబరాలతో కనకదుర్గమ్మకు అర్చనలు జరుగుతాయని ఆలయ వర్గాలు తెలిపాయి.

News March 10, 2026

125 రోజుల పని దినాల పోస్టర్ ఆవిష్కరణ

image

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న VB-G రామ్ జీ చట్టం పరిధిలో 125 రోజుల పనిదినాల లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. గ్రామీణ కార్మికులకు స్థిరమైన ఉపాధి కల్పన, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. 125 రోజుల పనిదినాల అమలుతో గ్రామీణ కుటుంబాలకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.