News March 14, 2025
నిర్మల్ : రేపు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించాలని డీఈఓ రామారావు గురువారం ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వాన లేఖలను అందించాలన్నారు. సమావేశంలో ఏజెండాలోని అన్ని అంశాలను చర్చించేలా చర్యలు తీసుకోవాలని HMలకు సూచించారు.
Similar News
News September 16, 2025
ఉద్యాన తోటల్లో రాగి లోప లక్షణాలు – నివారణ

రాగి లోపం వల్ల కొమ్మల చివర్ల నుంచి లేత ఆకులు రాలిపోతాయి. ఆకులు కిందకు వంగిపోతాయి. కాండము, కాయలు, ఆకులపై ఇటుక రంగు ఎండు మచ్చలు ఏర్పడతాయి. బొడిపెల్లాంటి మచ్చలు ఏర్పడి కాయల పరిమాణం తగ్గుతుంది. కాయల మధ్య బంక ఏర్పడుతుంది. కొమ్మల పైనుంచి కూడా బంక కారవచ్చు. రాగిధాతు నివారణ మందులను పిచికారీ చేసి.. కొన్ని శిలీంద్రాల ద్వారా వచ్చే తెగుళ్లతో పాటు పంటల్లో రాగిధాతు లోపాన్ని కూడా అరికట్టవచ్చు.
News September 16, 2025
ఉమ్మడి చిత్తూరు: డీఎస్సీలో 70 మిగులు సీట్లు

డీఎస్సీ-2025లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 1,478 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 1,408 మంది ఎంపికయ్యారు. 70 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
ఇంటర్ కాలేజీల ఎంప్లాయిస్కు ఆన్లైన్ సేవలు..!

ప్రభుత్వ ఇంటర్ కాలాశాలల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. వీరికోసం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం అనే పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో ఎంప్లాయిస్ లీవ్స్, NOC, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇంక్రిమెంట్స్, సర్వీస్ హిస్టరీ, పెన్షన్ వంటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఉమ్మడి KNRలో 53 ఇంటర్ కాలేజీలు ఉండగా, ఇందులో 1100 మందివరకు లెక్చరర్స్తోపాటు సిబ్బంది ఉన్నారు.