News March 14, 2025

బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

image

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో 7వ తరగతికి చెందిన దుర్గం సిద్ధార్థ, దాగం శోభిత్ ఎస్‌జీఎఫ్ అండర్14 విభాగంలో రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.

Similar News

News March 16, 2026

ప.గో: నేడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పరీక్ష రాశారంటే..!

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.

News March 16, 2026

అవసరమైన చోట విద్యుత్ నియంత్రికల సామర్థ్యం పెంచాలి: CMD

image

వేసవిలో అవసరం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వలన సంభవించే ప్రకృతి విపత్తుకు సమాయత్తం కావాలన్నారు. బ్రేక్ డౌన్ టీం, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండేటట్లు చూడాలన్నారు. ఓవర్ లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్న చోట్ల వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు పనులు చేపట్టి, ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని తెలిపారు.

News March 16, 2026

పల్లెనిద్ర తప్పనిసరి: కడప ఎస్పీ

image

పోలీస్ అధికారులు తప్పనిసరిగా పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టాలని ఎస్పీ నచికేత్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప డివిజన్ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అదే విధంగా గ్రామాలలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన జూదం, మట్కా తదితర వాటిపై కూడా ప్రత్యేక దృష్టిని నిలపాలని, మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.