News March 14, 2025

డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా: ఎస్పీ

image

మత సామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోళి పండగ జరుపుకోవాలని అనంతపురం ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం, ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. కీలక ప్రదేశాలు, కాలనీలు, రహదారులపై సీసీ కెమెరాలు ఉండటంతో పాటు డ్రోన్లతో నిఘా పెట్టామన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కుట్రలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Similar News

News March 20, 2026

ATP: పండగల ఎఫెక్ట్.. పెరిగిన చికెన్ ధరలు

image

ఉగాది, రంజాన్ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాలలో కేజీ చికెన్ గత వారం రూ.260కు విక్రయించారు. నేడు రూ.20లు పెరగగా రూ.280కు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రేపు రంజాన్ సందర్భంగా రూ.300లకు చేరే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెప్పారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 19, 2026

అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

image

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాల్లో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News March 19, 2026

అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

image

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.