News March 14, 2025
లింగంపేట: చెరువులో పడి మహిళ మృతి

చెరువులో పడి ఒక మహిళ మృతి చెందినట్లు లింగంపేట ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంబోజీపేట గ్రామానికి చెందిన కాశవ్వ గత నాలుగు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లిందన్నారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో గాలించినట్లు తెలిపారు. గ్రామ శివారులోని చెరువులో ఆమె మృతదేహం లభించగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News September 19, 2025
నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే: MLA

రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని MLA కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర మోకరిళ్లే వ్యక్తిని కాదని, కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్గానే ఉంటారని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని అన్నారు.
News September 19, 2025
HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
News September 19, 2025
HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.