News March 14, 2025

15 నుంచి ఒంటిపూట బడులు

image

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.

Similar News

News September 19, 2025

GDK: లాభాల వాటా ప్రకటించరా?: TBGKS

image

సింగరేణి లాభాల వాటా ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే వాటా ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు వాటా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం శ్రేణులు పాల్గొన్నారు.

News September 19, 2025

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News September 19, 2025

పెద్దపల్లి: మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిగా మధు

image

పెద్దపల్లి జిల్లా జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా కట్టేకోల మధుని నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఆముల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోచం మల్లయ్య, ఉపాధ్యక్షులుగా మద్దెల రామకృష్ణ, మట్ట రాజయ్య, కార్యదర్శులుగా చెవుల రాజయ్య, బండ రాజులను నియమించారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపార