News March 14, 2025

సిద్దిపేట: WOW.. గ్రూప్స్‌లో సత్తా చాటిన బ్రదర్స్

image

బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతులకు చెందిన కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేష్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం వెంకటేష్ పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నాడో హరికృష్ణ గ్రూప్‌-2లో 184 ర్యాంక్ సాధించారు.

Similar News

News March 1, 2026

ఫోన్‌లో సిమ్ ఉంటేనే ఈ యాప్స్ పనిచేస్తాయి!

image

ఇవాళ్టి నుంచి కొత్త టెలికం నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్‌తో కచ్చితంగా లింక్ అయి ఉండాలి. 6 గంటలకు ఒకసారి యాప్‌లు మీ ఫోన్‌లో సిమ్ ఉందో లేదో చెక్ చేస్తాయి. ఒకవేళ సిమ్ తీసివేస్తే అవి పనిచేయవు. అలాగే ఇకపై కంప్యూటర్ లేదా వెబ్‌లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి రీఅథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతుంది.

News March 1, 2026

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదు: BRనాయుడు

image

TTD ఛైర్మన్ పదవి ఎవడబ్బ సొత్తు కాదని, CM చంద్రబాబు చెబితేనే తాను పదవికి రిజైన్ చేస్తానని <<19270118>>BRనాయుడు<<>> అన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ రోజు నుంచే రాజీనామా చేయమని అడుగుతున్నారన్నారు. దీనిపై ఎందుకా అని ఆలోచిస్తే YCP చేసిన ఎన్నో అక్రమాలు బయటికి వస్తున్నాయన్నారు. తాను ఎక్కడా తగ్గేదేలే అన్నారు. వీడియోలో ఉన్న మహిళ కుటుంబానికి, తమ కుటుంబానికి 30 ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

News March 1, 2026

తీవ్రమైన యుద్ధం.. అమెరికాకు ఇరాన్ షాక్!

image

ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడులను పెంచింది. కువైట్‌లోని US నావల్ బేస్‌పై 4 బాలిస్టిక్ మిస్సైళ్లు, 12 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ తెలిపింది. దీంతో ఆ షిప్ పూర్తిగా దెబ్బతిందని, భారీగా అమెరికా సైనికులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అటు UAEలోని అమెరికా MSP క్లాస్ షిప్‌పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం.