News March 14, 2025

LRSపై నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

image

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ రోజువారి పరిష్కారం నివేదికలు పంపించాలని చెప్పారు. దీనిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 31లోగా డబ్బులు చెల్లిస్తే 25% రాయితీ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

image

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.

News November 4, 2025

ADB: పత్తి రైతుకు మరో కష్టం

image

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.

News November 4, 2025

WGL: డీఈవోల బాధ్యతలో గందరగోళం!

image

ఉమ్మడి జిల్లాలో DEO బాధ్యతల విషయంలో గందరగోళం నెలకొంది. JNG, MLG జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లకు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించగా, BPHL, MHBD, WGL జిల్లాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు విద్యా పరిపాలన అప్పగించడం సరికాదని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి పూర్తి స్థాయి డీఈవోలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.