News March 14, 2025
కడప: ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు.. ఎస్టీలకు రూ.75 వేలు

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అసంపూర్ణంగా ఉన్న గృహాలకు ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున సుమారు 25 వేల మందికి ఆర్థిక సాయం విడుదల చేస్తామన్నారు. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు సంబంధిత అధికారులు నిర్మాణాల వద్దకు వచ్చి చిత్రాలు తీసి అప్లోడ్ చేస్తారని స్పష్టంచేశారు.
Similar News
News March 19, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 259 మంది విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో బుధవారం సెకండ్ ఇంటర్ కెమిస్ట్రీ పేపర్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. నేడు జరిగిన పరీక్షలకు 12,145 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 11,886 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 98% విద్యార్థులు పరీక్షలు రాశారు. 259 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.
News March 19, 2026
వీరశివారెడ్డి బీజేపీలో చేరిక సాధ్యమేనా..?

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
News March 19, 2026
వీరశివారెడ్డి బీజేపీలో చేరిక సాధ్యమేనా..?

కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పదేపదే ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ముహూర్తం ఖరారు కాలేదు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ సీఎం రమేశ్ మద్దతు తనకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని కొందరు నేతలు ఆయన చేరికను అడ్డుకుంటున్నట్లు సమాచారం. దీంతో వీరశివారెడ్డి కమలం గూటికి చేరడం సాధ్యమవుతుందో లేదోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.


