News March 14, 2025

దాదాపు రెండేళ్లకు ఓటీటీలోకి..

image

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమా సోనీ లీవ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా అఖిల్ కొత్త మూవీ షూటింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం.

Similar News

News January 8, 2026

CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని: జగన్

image

AP: రాజధాని అమరావతిని రివర్ బేసిన్‌లో నిర్మిస్తున్నారని జగన్ అన్నారు. ‘అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలి. నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా? అమరావతిలో రాజధాని కట్టకూడదు. గుంటూరు-విజయవాడ మధ్య కడితే బాగుంటుంది. అసలు రాజధానే లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు. CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని’ అని మీడియాతో పేర్కొన్నారు.

News January 8, 2026

వెనిజులా ఆయిల్ ఎగుమతులను మేమే కంట్రోల్ చేస్తాం: అమెరికా

image

వెనిజులా క్రూడాయిల్ ఎగుమతులను తామే నియంత్రిస్తామని అమెరికా తెలిపింది. చమురు అమ్మకంతో వచ్చే ఆదాయాన్ని US అకౌంట్లలోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ పేర్కొన్నారు. ముందుగా స్టోరేజ్‌లో ఉన్న ఆయిల్‌ను విక్రయిస్తామని చెప్పారు. 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను తమకు వెనిజులా అందజేస్తుందని నిన్న ట్రంప్ ప్రకటించారు. కాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మదురోను US <<18751661>>అరెస్టు<<>> చేయడం తెలిసిందే.

News January 8, 2026

మొక్కజొన్నలో భాస్వరం లోపం నివారణ ఎలా?

image

మొక్కజొన్న ఆకులు ఊదా, వంకాయ రంగులోకి మారితే అది భాస్వరం లోపం. చలి తీవ్రత వల్ల భూమిలో భాస్వరం ఉన్నా మొక్క తీసుకోలేదు. దీని వల్ల మొక్కలు ఎదగక వేర్లు బలహీనపడి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు లీటరు నీటిలో 10గ్రా. DAP లేదా 19:19:19 ఎరువును కరిగించి పంటపై పిచికారీ చేయాలి లేదా నానో DAP లీటరు నీటికి 2ml చొప్పున కలిపి వారం వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. సిలికాన్ జిగురు కలిపి పిచికారీ చేస్తే మరింత లాభం.