News March 14, 2025

PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Similar News

News September 17, 2025

సిద్దిపేట: ‘నెత్తురు చిందించిన నేల బైరాన్‌పల్లి’

image

రజాకార్ల ఆగడాలను భరించలేక పిడికిళ్లు బిగించి నిజాంల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. వడిశెల రాళ్లతో రజాకార్లకు జవాబు చెప్పిన యోధులను కన్న ఊరు బైరాన్ పల్లి. రజాకార్లకు ఎదురు నిలిచి నెత్తురు చిందించిన పల్లెల్లో ఒకటి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లిలో రజాకార్లు జరిపిన దాడిలో 119 మంది యోధులు నేలకొరిగారు. ఈ మారణకాండ అమృత్ సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటనను గుర్తుచేసింది.

News September 17, 2025

MDK: దున్నేవాడికే భూమిని పంచిన వ్యక్తి ‘కేవల్ కిషన్’

image

మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేశారు ఆయనే మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన కేవల్ కిషన్. ప్రజా పోరాటాలు చేసి భూ పోరాటాలతో నిజాం సర్కార్‌ను గడగడలాడించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా తన పంథాను మార్చుకోలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దున్నేవాడికే భూమి అంటూ పేదలకు భూములు పంచి పెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

News September 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 17, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.