News March 14, 2025

PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Similar News

News November 7, 2025

వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

image

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్‌ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.

News November 7, 2025

డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

image

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.

News November 7, 2025

NZB: 38.15 లక్షలు తీసుకొని మోసగించిన మహిళ అరెస్ట్

image

నిజామాబాద్‌లో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ.38.15 లక్షలు తీసుకొని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి బాధితుల చెక్కులు, ప్రాంసరీ నోట్లు, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.