News March 14, 2025

సిద్దిపేట: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుం చెల్లించిన వారే అర్హులని చెప్పారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్(ప్రాక్టికల్) పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి.

Similar News

News March 22, 2026

కడప: సీఐ అశోక్‌రెడ్డిపై ‘నాన్‌ బెయిలబుల్‌’ కేసు..!

image

గతంలో చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె స్టేషన్లలో సీఐగా పనిచేసిన అశోక్‌రెడ్డిపై నమోదైన నాన్‌ బెయిలబుల్‌ కేసు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆస్తుల సెటిల్మెంట్ల కోసం తనను బెదిరించడమే కాకుండా, రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ అనంతపురానికి చెందిన బాధితుడు ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2026

IPL 2026 తర్వాత ధోనీ గుడ్ బై: ఉతప్ప

image

IPL 2026 తర్వాత ధోనీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప హింట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో ధోనీ కేవలం ఫినిషర్‌గా కాకుండా ‘మెంటార్ కమ్ ప్లేయర్’గా కనిపిస్తారని తెలిపారు. తన రిటైర్మెంట్ కోసం సిద్ధమవుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానానికి పడిపోయే అవకాశం ఉందని, దీనివల్ల రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ మరింత మెరుగుపడుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డారు.

News March 22, 2026

రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

image

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.