News March 14, 2025

సిద్దిపేట: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ పరీక్షలు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు(థియరీ) నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30గం. నుంచి 5:30 వరకు ఉంటాయన్నారు. పరీక్ష రుసుం చెల్లించిన వారే అర్హులని చెప్పారు. 26 నుంచి మే 3 వరకు ఇంటర్(ప్రాక్టికల్) పరీక్షలు ఉంటాయన్నారు. డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి.

Similar News

News September 16, 2025

రూ.2 లక్షల వరకు ధరలు తగ్గింపు

image

ప్రీ GST, పండుగ డిస్కౌంట్ కింద కార్ల కంపెనీ కియా ఇండియా తెలుగు రాష్ట్రాల ప్రజలకు రూ.2 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. సెల్టోస్ మోడల్‌పై రూ.2 లక్షలు, కారెన్స్ క్లావిస్‌పై రూ.1.33 లక్షలు, కారెన్స్‌పై రూ.1.02 లక్షల తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 22 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ ఉందని, అయితే ధరల్లో మార్పు ఉంటుందని వెల్లడించింది.

News September 16, 2025

గుంటూరు: నేడు కోడెల వర్ధంతి

image

ప్రముఖ రాజకీయ నాయకుడు, నవ్యాంధ్ర తొలి సభాపతి, పల్నాటి పులిగా పేరుపొందిన కోడెల శివప్రసాదరావు 1947 మే 2న ఉమ్మడి గుంటూరు జిల్లా కండ్లగుంటలో జన్మించారు. డాక్టర్‌గా పని చేస్తూనే 1983లో టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా 5సార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆయన పలు శాఖల మంత్రిగా పనిచేశారు. 2014లో గెలిచి నవ్యాంధ్ర తొలి శాసన సభాపతి అయ్యారు. 2019 సెప్టెంబరు 16న హైదరాబాదులో ఆయన స్వగృహంలో మరణించారు.

News September 16, 2025

మెదక్-సిద్దిపేట మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ

image

మెదక్-సిద్దిపేట రహదారిపై నందిగామ వద్ద వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో గత 20 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. కల్వర్టు దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.