News March 14, 2025

ముదిగుబ్బ: కూతురిని తీసుకొచ్చేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

image

విజయవాడలో ఇంటర్ చదువుతున్న కూతురిని పరీక్షల అనంతరం తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ముదిగుబ్బకు చెందిన శ్రీనివాసరెడ్డి కూతురు విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఆఖరి పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి వెళ్లాడు. కూతురిని పరీక్షకు పంపి వారు షాపింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పితో కుప్పకూలి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

Similar News

News March 14, 2025

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల ప్రచారం ఫేక్: ఈఓ

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల నియామకం జరుగుతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని ఆలయ ఈఓ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ /సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ ప్రచారం జరుగుతుందని దేవస్థానం దృష్టికి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగాలు ప్రకటనలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.

News March 14, 2025

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచం: తిరుపతి SP

image

మహిళ రక్షణకు శక్తి యాప్ ఒక ఉక్కు కవచమని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్క మహిళ మొబైల్ లో “శక్తి” యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి సహాయం పొందాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను రూపొందించిందని తెలిపారు.

News March 14, 2025

గుడ్ల కోసం అమెరికా యాతన, ఈయూకి యాచన

image

అమెరికాను గుడ్ల కొరత వేధిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు భారీగా చనిపోతుండటంతో గుడ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏడాది కాలంలో గుడ్ల ధర ఏకంగా 59శాతం మేర పెరగడం ట్రంప్ సర్కారుపై ఒత్తిడిని పెంచుతోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలతో ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో డెన్మార్క్ సహా ఐరోపా సమాఖ్యలోని దేశాలు ఎన్ని వీలైతే అన్ని గుడ్లను పంపించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది.

error: Content is protected !!