News March 14, 2025

సత్తుపల్లి సబ్ జైలర్, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?

image

రిమాండ్ ఖైదీ పరారై పట్టుబడిన కేసులో సత్తుపల్లి సబ్ జైలర్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన పెండ్ర రమేష్ అనే రిమాండ్ ఖైదీ పరారై అదే రోజు పట్టుబడగా జైళ్లశాఖ వరంగల్ డీఐజీ ఎం.సంపత్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సత్తుపల్లి సబ్ జైలర్ సోమరాజు ప్రవీణ్, కానిస్టేబుళ్లు మారేశ్వరరావు, శ్రీనులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 5, 2025

టీబీ నివారణపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

image

మహబూబాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమం, విద్య సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేసి క్షయ వ్యాధి నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 5, 2025

KMR: ఇన్‌ఛార్జ్ డీబీసీడీఓగా సయ్యద్ రఫీక్

image

కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇన్‌ఛార్జ్ బాధ్యతలను సయ్యద్ రఫీక్ శుక్రవారం స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ డీబీసీడీఓగా పని చేసిన స్రవంతి ఆదిలాబాద్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు.

News July 5, 2025

పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

image

సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం, వసతి సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.