News March 14, 2025
కరీంనగర్: ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాడ్ గోడౌన్లను తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి గోడౌన్ తనిఖీ చేశారు.
Similar News
News April 18, 2026
KNR: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HYD దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ సంస్థలో 3 సంవత్సరాల 2026-27 డిప్లమో కోర్సులకు అనాధ బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి తెలిపారు. దీనికి పాలిటెక్ని ప్రవేశపరిక్ష రాయకున్నా టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తారు. మే 23లోగా KNR బాల రక్షభవన్లో దరఖాస్తు చేయాలి. వివరాలకు 9490881098 సంప్రదించవచ్చు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.


