News March 14, 2025
హోలీ పండుగ.. కోనసీమ ఎస్పీ సూచనలు

హోలీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సీసీటీవీల ద్వారా హోలీ వేడుకలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులపై రంగులు చల్లటం వంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. హోలీలో ఎటువంటి రసాయనిక రంగులను వాడొద్దని ఎస్పీ సూచించారు.
Similar News
News March 17, 2026
NLG: మొదటి విడత కంప్లీట్… రెండో విడతకు కసరత్తు

జిల్లాలో వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండో విడత యాంత్రీకరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగులో యంత్రాల వాడకాన్ని పెంచి, రైతులకు శ్రమ, పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.4 కోట్ల భారీ నిధులు కేటాయించనున్నది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో రూ.4 కోట్ల వ్యయంతో 1,900 మంది రైతులకు ప్రభుత్వం విజయవంతంగా పరికరాలను అందజేసింది.
News March 17, 2026
ఏలూరు: రైలు ఢీకొని ఇద్దరు మృతి

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఆదివారం ఇరువురు మృతి చెందారు. వట్లూరు – నూజివీడు మధ్య పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు జీన్స్, టీ-షర్టు ధరించి ఉన్నాడు. బొమ్మలూరు సమీపంలో మరో ఘటనలో బిహార్కు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
News March 17, 2026
యుద్ధ ప్రభావం: నంద్యాల జిల్లాలో కుప్పకూలిన ధరలు

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు నంద్యాల జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. క్వింటాల్ పసుపు రూ.13 వేల నుంచి రూ.9 వేలకు, మొక్కజొన్న రూ.2500 నుంచి రూ.1400కు తగ్గింది. అరటి, నిమ్మ ధరలు సైతం సగానికి పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.


