News March 14, 2025
అన్నమయ్య జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

➤ సోమవారం(17వ తేదీ) నుంచి పరీక్షల ప్రారంభం
➤ జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 121
➤ మొత్తం ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లు: 505
➤ పరీక్ష రాసే విద్యార్థులు: 23,355
➤ డ్యూటీ చేసే సిబ్బంది సంఖ్య: 1200
➤ సమస్యాత్మక కేంద్రాలు: గాలివీడు ఉర్దూ స్కూల్, చక్రాయపేట, పాటూరు జడ్పీ, కలికిరి జడ్పీ గర్స్, ఓబులవారిపల్లె గురుకులాలు, సీటీఎం జడ్పీ, చింతపర్తి జడ్పీ
Similar News
News March 19, 2026
సంగారెడ్డి: కిడ్నాపర్లను రాళ్లతో కొట్టిన పిల్లలు

సంగారెడ్డి ద్వారకానగర్ మైదానంలో ఆడుకుంటున్న పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దుండగులు గురువారం విఫలయత్నం చేశారు. ఆటోలో వచ్చిన ముగ్గురు ఓ బాలుడిని బలవంతంగా ఎక్కించుకునేందుకు ప్రయత్నించగా.. తోటి పిల్లలు భయపడకుండా వారిపై రాళ్లతో దాడికి దిగారు. పిల్లల అరుపులతో స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు ఆటోలో పరారయ్యారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామని సీఐ రాము నాయుడు తెలిపారు.
News March 19, 2026
రేవంత్కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.
News March 19, 2026
బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర ట్వీట్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్పై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు.. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం’ అని ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంపై అభిమానాన్ని బయటపెట్టారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


