News March 14, 2025

వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు

image

కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన <<15745116>>వైసీపీ<<>> నాయకుడు సోముల లోకేశ్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో అదే గ్రామానికి చెందిన 9మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కోవెలకుంట్ల సీఐ హనుమంతు నాయక్ వెల్లడించారు. గ్రామానికి చెందిన సూర చిన్న సుబ్బారెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, సురేశ్ కుమార్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి, కోదండరామిరెడ్డి, మోహన్, ఆర్.చిన్న సుబ్బారెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.

Similar News

News March 21, 2026

నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

image

నిర్మల్, ఖానాపూర్, బైంసా మూడు మున్సిపాలిటీలలో ఆస్తీ పన్నుల వసూలుకు జిల్లాలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా వార్డ్ ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. మార్చి 31 నాటితో గడువు తేదీ ముగియనుండగా ఈ నెల 1 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మరో 11 రోజులు గడువు మాత్రమే ఉంది. 100% లక్ష్యాన్ని అధికారులు నెరవేరుస్తారా చూడాలి.

News March 21, 2026

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.

News March 21, 2026

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ

image

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.